వైష్ణవి ఏం తప్పు చెసింది? తండ్రి మీద పగతో....అదీ ఆస్తి తగాదాలతో, ఓ పసి పాపని దారుణంగా హత్య చేయడం మనసుని తొలిచేసింది.
వైష్ణవిని కిడ్నాప్ చేసి, హతమార్చి, పెట్రోల్పోసి తగులబెట్టి అనంతరం మృతదేహం ఆనవాలులేకుండా చేయడం పైశాచికత్వానికి పరాకాష్ట. ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన ముద్దుల కూతురు మరణించిందని తెలుసుకున్న తండ్రి ప్రభాకర్ గుండెపోటుతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
ఈ ఘటన మానవత్వానికే మచ్చ. ఈ చర్యని ఎండగట్టడానికి పశుత్వం అనే మాట సరిపోదు, సరికాదు, అవసరమైతే ఏదైన కొత్త పదాన్ని సృష్టించైనా వాడాలి. మనుషులుగా మన ప్రస్థానం ఎటు?